![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -292 లో.....నర్మద వాళ్ళ నాన్న అన్న మాటలకి రామరాజు కోపంగా ఉంటాడు. రామరాజుకి ఇంకా కోపం వచ్చేలా శ్రీవల్లి మాట్లాడుతుంది. దాంతో సాగర్ పై రామరాజు కోప్పడతాడు. నువ్వు మిల్ లో పని చెయ్యడం నామూషీగా ఫీల్ అవుతున్నావా అని సాగర్ ని రామరాజు అడుగుతాడు.
ఆయన మాటలు పట్టుకొని మీరు తప్పుగా అర్థం చెసుకుంటారని సాగర్ అనగానే ఏమంటున్నావ్ రా నువ్వే మీ మావయ్య దగ్గరికి వెళ్లి ఇల్లరికం వస్తానన్నట్లు ఉన్నావని రామరాజు అంటాడు. నిన్ను సొంత కూతురులాగా చూసుకున్నామని నర్మదతో రామరాజు అంటాడు. మా నాన్న అలా ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు మావయ్య కానీ నేను నా పుట్టింటికి దూరంగా ఉన్నాను కానీ వాళ్ళ ప్రేమకి కాదు నన్ను మీరు బాగా చూసుకున్నారు. మా నాన్న తరుపున సారీ, సాగర్ తరుపున కూడా సారీ అని నర్మద చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లికి విశ్వ ఫోన్ చేసి అమూల్య ని బయటకు తీసుకొని రమ్మని చెప్తాడు. అమూల్యని తీసుకొని శ్రీవల్లి గేట్ దగ్గరికి వస్తుంది. కావాలనే భద్రవతి ఆ ధీరజ్ పై కంప్లైంట్ ఇస్తానని అంటుంది. వద్దు అత్త ఎంతైనా వాడు అత్త కొడుకు కదా అని విశ్వ అంటాడు. ఇక వాళ్ళిద్దరి మాటలు అమూల్య వింటుందని విశ్వ పాజిటివ్ గా మాట్లాడతాడు. అదంతా అమూల్య వింటుంది.
మరొకవైపు ప్రేమ లాకెట్ పట్టుకొని ఉంటుంది. ధీరజ్ వచ్చి ఆ లాకెట్ చూడలేదు.. చూపించమని అడుగుతాడు. దాంతో ప్రేమ కోపంగా పడుకుంటుంది. ఆకలిగా ఉందని ధీరజ్ అనుకుంటాడు. అది విని ప్రేమ భోజనం తీసుకొని వచ్చి ధీరజ్ కి తినిపిస్తుంది. తరువాయి భాగంలో మా ఆయన నాకు ముద్దు పెట్టాడని శ్రీవల్లి మురిసిపోతుంటే అదేమైన వింతా.. మా ఆయన పెట్టాడు. అత్తయ్యకి మావయ్య పెట్టాడు. ప్రేమకి మొన్న ధీరజ్ పెట్టాడని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |